నేడు సిద్దిపేటలో హరీష్ రావు, కేటీఆర్‌ల పర్యటన

నేడు సిద్దిపేటలో హరీష్ రావు, కేటీఆర్‌ల పర్యటన

నేడు సిద్దిపేటలో మంత్రులు హరీష్ రావు, కేటీఆర్‌ పర్యటించనున్నారు. ఇందులో భాగంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతారు. సిద్దిపేటలో 63 కోట్లతో నిర్మించిన ఐటీ టవర్‌ను ప్రారంభిస్తారు. తర్వాత సీసీ, బీటీ రోడ్లతో పాటు మురికి కాల్వల నిర్మాణానికి శంకుస్థాపనలు చేయనున్నారు. అదేవిధంగా ఐటీ టవర్ వద్ద బహిరంగ సభలో పాల్గొంటారు. దశాబ్ది కాలంలో చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు తెలియజేస్తారు.

Next Story