By - Bhoopathi |4 July 2023 2:45 AM GMT
తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు విజన్పై ప్రశంసలు కురిపించారు. హైదరాబాద్లో జరిగిన ఎఫ్టీటీసీఐ ఎక్స్లెన్స్ అవార్డుల కార్యక్రమంలో కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాడు చంద్రబాబు హయాంలో పట్టణాల అభివృద్ధి జరిగిందని తెలిపారు. ఆ తర్వాత తొమ్మిదేళ్లలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. గత ప్రభుత్వాల హయాంలో జరిగిన అభివృద్ధిని తమ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లిందని చెప్పారు. దేశీయ ఉత్పత్తుల వినియోగాన్ని పెంచుకొని.. దిగుమతులను తగ్గించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఉత్పత్తి రంగంలో చైనాతో పోటీ పడాలన్న మంత్రి కేటీఆర్.. ప్రతి ఒక్కరు గ్లోబల్ థింకింగ్, స్మార్ట్గా పనిచేయడం అలవర్చుకోవాలని సూచించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com