
By - Vijayanand |31 Aug 2023 1:36 PM IST
వైసీపీ ప్రభుత్వంపై ఏకంగా ఆ పార్టీ కార్యకర్తే విసిగిపోయాడు. చిన్న పని కోసం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న పని మాత్రం కావడంలేదని తన చెప్పుతో తానే కొట్టుకున్నాడు. వైసీపీ కార్యకర్తను అయినందుకు తనకు ఇలా జరగాల్సిందే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కర్నూలు జిల్లా క్రిష్ణగిరి మండల సంగాల గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త వెంకటేష్ పొలం పని నిమిత్తం తహసీల్దార్ కార్యాలయం చుట్టు రెండు నెలలుగా తిరుగుతున్నాడు. ఏ అధికారి తన గోడు వినిపించుకోవడంలేదని ఆవేదన చెందాడు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com