Laknavaram : కుండపోత వర్షాలకు నీటమునిగిన లక్నవరం కేబుల్ బ్రిడ్జ్

Laknavaram : కుండపోత వర్షాలకు నీటమునిగిన లక్నవరం కేబుల్ బ్రిడ్జ్

భారీ వర్షాలకు ములుగు జిల్లాలోని లక్నవరం సరస్సు నిండుకుండలా మారింది. వరద ప్రవాహంతో సరస్సులోకి నీరు అధికంగా వచ్చి చేరింది. వరదలు పోటెత్తటంతో తీగల వంతెన పూర్తిగా నీటిలో మునిగిపోయింది. మరోవైపు ఫస్ట్‌ ఫ్లోర్‌ కాటేజీలలోకి సైతం వరద నీరు చేరింది. ఈ నేపథ్యంలో అధికారులు సరస్సు వద్దకు పర్యాటకులను అనుమతించడం లేదు. వరద ఉధృతి పూర్తిగా తగ్గిన తరువాతే టూరిస్టులను అనుమతిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు ములుగు కలెక్టర్‌, జిల్లా ఎస్పీ సైతం రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Next Story