
By - Vijayanand |12 Aug 2023 1:59 PM IST
చిన్నారి లక్షిత పోస్టుమార్టం పూర్తి అయింది.రూయా ఆస్పత్రి మార్చురీలో పంచనామా చేసి..మృత దేహాన్ని లక్షిత స్వస్థలం పోతిరెడ్డిపాడుకి ప్రత్యేక అంబులెన్స్లో తరలించారు టీటీడీ అధికారులు.చిరుత దాడిలోనే లక్షిత మృతి చెందనట్లు పోస్టుమార్టం నివేదికలో తెలిపారు.చిరుత దాడిగానే చిన్నారి తండ్రి దినేష్ కుమార్ కూడా నిర్థారించారు. శుక్రవారం రాత్రి అలిపిరి నడక మార్గంలో రాత్రి తప్పిపోయిన లక్షిత.. ఇవాళ ఉదయం లక్ష్మీనరసింహస్వామి ఆలయం దగ్గర విగత జీవిగా కనిపించింది. చిన్నారి శరీరంపై తీవ్ర గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com