
By - Vijayanand |6 Aug 2023 1:56 PM IST
లంబాడీలను ఎస్టీ జాబితాలో నుంచి తొలగించాలని ఎంపీ సోయం బాబు రావు చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ లంబాడీ సంఘాల జేఏసీ నాయకులు నాంపల్లిలోని బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించారు. సోయం బాబూరావు పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసి, పార్టీ నుండి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. పార్టీ కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించిన జేఏసీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. జేఏసీ నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఉద్రిక్తత వాతావరణం ఏర్పడటంతో జేఏసీ నాయకులను అరెస్ట్ చేసి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com