Himachal Pradesh: ఘోర విషాదం; విరిగిపడ్డ కొండచరియలు, 15 మంది మృతి

Himachal Pradesh: ఘోర విషాదం; విరిగిపడ్డ కొండచరియలు, 15 మంది మృతి

హిమాచల్ ప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. శిమ్లా లోని ఓ ఆలయంపై కొండచరియలు విరిగిపడి 15 మంది మృతిచెందారు. పలువురు శిథిలాల కింద చిక్కుకుపోయారు. సమాచారమందుకున్న పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు 9 మృతదేహాలను వెలికితీయగా.. శిథిలాల కింద మరో 20 మందికి పైనే ఉన్నట్లు తెలిపారు. వారి కోసం గాలిస్తున్నారు. శ్రావణ సోమవారం కావడంతో ఉదయం నుంచే శివాలయానికి ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చారు. ప్రమాద సమయంలో ఆలయంలో 50 మంది వరకు ఉండొచ్చని భావిస్తున్నారు.

Next Story