మేకల మందపై చిరుత పులుల దాడి

మేకల మందపై చిరుత పులుల దాడి

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని కోటేకల్‌ గ్రామంలో చిరుత పులుల సంచారం కలకలం రేగింది. మేకల మందపై రెండు చిరుత పులులు దాడి చేశాయి. అయితే గ్రామ శివారులోని కొండల్లో చిరుతలు ఉన్నట్లు గ్రామస్తులు గుర్తించారు. దీంతో పొలాలకు వెళ్లేందుకు రైతులు భయపడుతున్నారు. ఏక్షణాన ఎక్కడి నుంచి వచ్చి దాడి చేస్తాయోనని కోటెకల్ గ్రామ ప్రజలు భయందోళన చెందుతు న్నారు. పులుల సంచారంపై అటవీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనుషుల ప్రాణాలు పోతే కానీ చిరుతలను పట్టుకోరా అంటూ క్వశ్చన్ చేస్తున్నారు.

Next Story