
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా వివిధ రాష్ట్రాల్లో నాలుగో విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు భారీగా క్యూలో నిలబడి ఓటు వేస్తున్నారు. పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. దేశవ్యాప్తంగా 96 నియోజకవర్గాల్లో ఓటింగ్ కొనసాగుతోంది. జమ్ముకశ్మీర్లో ఉదయం నుంచే ఓటర్లు భారీగా బారులు తీరారు. తెల్లవారుజాము నుంచే భారీగా ఓటర్లు బారులు తీరడంతో ఈసారి జమ్ముకశ్మీర్లో ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు తెలిపారు. జమ్ముకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, ఉపాధ్యక్షుడు ఓమర్ అబ్దుల్లా ఓటు హక్కు వినియోగించుకున్నారు. నాలుగో విడతలో పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉజ్జయిన్ పోలింగ్ స్టేషన్లో మధ్యప్రదేశ్ CM మోహన్యాదవ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధ్యప్రదేశ్లోని ఇందోర్లో ఓటు వేసేందుకు తెల్లవారుజామునుంచే భారీ క్యూ ఉండడంతో అల్పహారం అందించారు. ఓటర్లకు ఉచితంగా అల్పాహారం , ఐస్క్రీమ్లు అందించారు.
నాలుగో దశలో పలువురు ప్రముఖులు బరిలో ఉన్నారు. బిహార్లోని బెగుసరాయ్ నుంచి కేంద్ర మంత్రి గిరిరాజ్సింగ్ పోటీ చేస్తున్నారు. మరో కేంద్ర మంత్రి అర్జున్ ముండా ఝార్ఖండ్లోని ఖూంటీ స్థానంలో పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్రంజన్ చౌధరీ బంగాల్లోని బహరంపుర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్య వహిస్తున్నారు. బాలీవుడ్ నటుడు శత్రుఘన్సిన్హా తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఉత్తర్ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ప్రస్తుతం కన్నౌజ్ నుంచి బరిలో నిలిచారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com