
By - Vijayanand |26 Aug 2023 4:55 PM IST
సీఎం జగన్పై విమర్శలు గుప్పించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. అప్పు చేసి పేదలకు డబ్బులు ఇచ్చామని చెప్పుకుంటున్న ప్రభుత్వం.. పన్నులు రూపేణా రెట్టింపు దండుకోవటం సంక్షేమ పాలనా అని ప్రశ్నించారు. జగన్ నొక్కే బటన్కు కరెంట్ లేదు... ఆ బటన్ ఎన్నిసార్లు నొక్కినా డబ్బులు పడవన్నారు. జగన్ చర్యలతో ఏపీ పరువుపోయిందన్నారు. ఏపీలో ఎక్కడ చూసిన భూ కబ్జాలు, మట్టి దోపిడీనే ఉందన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం గెలుపు అనివార్యమని చెప్పారు. నూజివీడు నియోజకవర్గం ముసునూరు గ్రామస్తులతో లోకేష్ రచ్చబండ నిర్వహించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com