
By - Bhoopathi |10 July 2023 6:45 AM IST
బీసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా చర్యలు చేపడతామన్నారు టీడీపీ యువనేత నారా లోకేష్. బీసీ సామాజికవర్గాలకు దామాషా ప్రకారం నిధులు కేటాయిస్తామన్నారు. గొర్రెల కాపరుల సంక్షేమానికి కృషి చేస్తామని చెప్పారు. గొర్రెల కొనుగోలుకు రుణాలు, పెత్తందారుల చేతిలో ఉన్న మేత భూములను తిరిగి బీసీలకు అప్పగిస్తామని హామీ ఇచ్చారు. రజక కార్పొరేషన్ను బలోపేతం చేసి పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటామన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే రజకులకు దోబి ఘాట్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com