
By - Vijayanand |26 Aug 2023 3:43 PM IST
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం మరో మైలురాయికి చేరుకుంది. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం పోతిరెడ్డిపల్లిలో 195వ రోజు ప్రారంభమైన పాదయాత్ర... ముసునూరు మండలం సింహాద్రిపురం వద్ద 2600 కిలో మీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా లోకేష్ శిలాఫలకాలను ఆవిష్కరించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని మెట్ట ప్రాంతాలకు సాగు నీరందిస్తామని చెప్పారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com