181వ రోజుకు చేరిన లోకేష్ పాదయాత్ర

181వ రోజుకు చేరిన లోకేష్ పాదయాత్ర

యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. ఇవాళ్టితో... పాదయాత్ర 181వ రోజుకు చేరింది. ఇప్పటి వరకు 2410 కిలోమీటర్లు నడిచారు లోకేష్. ప్రస్తుతం పల్నాడు జిల్లాలోని పెదకూరపాడు నియోజకవర్గంలో.. పాదయాత్ర కొనసాగుతోంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు క్రోసూరు శివారు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. క్రోసూరూ నాలుగు రోడ్ల జంక్షన్‌లో స్థానికులతో సమావేశమవుతారు లోకేష్. ఆ తర్వాత.. క్రోసూరు - అందకూరు రోడ్డులో బహిరంగ సభలో... లోకేష్ ప్రసంగిస్తారు.

Next Story