
ప్రముఖ పారిశ్రామిక వేత్త ఎలాన్ మస్క్.... భారత్లో పర్యటించనున్నారు. భారత్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశం కోసం ఎదురుచూస్తున్నానని మస్క్.. ఎక్స్లో పోస్టు చేశారు. అయితే పర్యటన తేదీని మస్క్ వెల్లడించలేదు. ఈ నెలాఖరులో టెస్లా సీఈవో భారత్లో పర్యటించనున్నట్లు అంతర్జాతీయ వార్తాసంస్థ రాయిటర్స్ తెలిపింది. దేశంలో టెస్లా విద్యుత్కార్ల తయారీ కేంద్రం ఏర్పాటుకు సంబంధించి మస్క్.. పెట్టుబడుల ప్రకటన చేసే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. సుమారు 200 కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు పెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. గతేడాది జూన్లో అమెరికాలో పర్యటించిన ప్రధాని మోదీతో భేటీ అయిన మస్క్.. వీలైనంత త్వరలో టెస్లా పరిశ్రమను భారత్లో నెలకొల్పుతామని ప్రకటించారు. విద్యుత్వాహనాల దిగుమతిపై పన్నులను 85 శాతం తగ్గించే కొత్త ఈవీ పాలసీని భారత ప్రభుత్వం ప్రకటించిన నెలలోనే మస్క్ భారత పర్యటన ఖరారైంది. ఈ పాలసీ ప్రకారం.. ప్యాసెంజర్ కార్లను తయారు చేసే ఈవీ సంస్థలు.. కనిష్టంగా 29 లక్షల రూపాయల ధర ఉన్న వాహనాలపై 85 శాతం తగ్గించిన దిగుమతి సుంకంతో.. పరిమిత సంఖ్యలో ఐదేళ్ల పాటు యూనిట్లను దిగుమతి చేసుకోవచ్చు.MUSK: ఈ నెలఖారులో భారత్లో మస్క్ పర్యటన
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com