
By - Vijayanand |12 July 2023 11:43 AM IST
సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలం లచ్చపేటలో విషాదం చేటు చేసుకుంది. పెద్దలు ప్రేమను అంగీకరించరనే భయంతో ఓ జంట ఆత్మహత్య ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతులు భగీరథ్, నేహాగా గుర్తించారు పోలీసులు. వీరి కులాలు వేరు కావడంతో ప్రేమను పెద్దలు అంగీకరించరనే భయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మృతులిద్దరూ మైనర్లేనని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com