By - Bhoopathi |11 July 2023 5:30 AM GMT
బయట స్వేచ్చగా తిరగాల్సిన కోడి లాకప్లో బందీ అయ్యింది. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పీఎస్లో చోటు చేసుకుంది. బురెడ్డిపల్లి శివారుల్లో నాటు కోళ్ల చోరీ వ్యవహారంలో కరివేన గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే సమయంలో నిందితుడు కొట్టేసిన కోడిని సైతం జైలుకు తరలించారు. ఇక అందులోనే దర్జాగా గడుపుతున్న కోడి కూతలతో స్టేషన్ను హోరెత్తిస్తోంది. నిందితుడిని అదుపులోకి తీసుకునే సమయంలో అతని వద్ద ఉన్న కోడిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు పోలీసులు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com