
By - Chitralekha |29 July 2023 3:58 PM IST
తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. కృష్ణగిరి ప్రాంతంలో బాణసంచా గోదాంలో పేలుడు సంభవించింది. ఘటనలో ఐదుగురు మృతిచెందగా.. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి మూడు ఇళ్లు కుప్పకూలాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలంలో సహాయకచర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. అటు శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com