
By - Chitralekha |29 July 2023 3:39 PM IST
కేశినేని ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. విజయవాడ చిట్టినగర్లో కేశినేని చిన్ని ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్కు విశేష స్పందన లభించింది. భారీ ఎత్తున పేద ప్రజలు తరలివచ్చి వైద్యపరీక్షలు చేయించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు వైద్యం అందించడంలో పూర్తిగా విఫలమైందని కేశినేని చిన్ని ఆరోపించారు. పేదవాడికి కూడు, గూడు, విద్య, వైద్యం అన్న ఎన్టీఆర్ ఆశయాలు కొనసాగిస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును సీఎం చేయడమే తన లక్ష్యమని కేశినేని చిన్ని స్పష్టం చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com