Bihar: కాంగ్రెస్ ప్రజాప్రతినిధి ఇంట్లో 24 ఏండ్ల యువకుడి మృతదేహం..

Bihar: కాంగ్రెస్ ప్రజాప్రతినిధి ఇంట్లో 24 ఏండ్ల యువకుడి మృతదేహం..

కాంగ్రెస్ కు చెందిన ఓ ఎమ్మెల్యే ఇంట్లో యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం బిహార్లో సంచలనం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కాంగ్రెస్ ఎమ్మెల్యే నీతూ సింగ్‌ కు చెందిన ఇల్లు అది. ఎమ్మెల్యే మేనల్లుడు గోలు సింగ్ సైతం పట్నా లోనే నివసిస్తున్నాడు. అయితే అక్కడే మృతుడు పీయూశ్‌ సింగ్‌ కొంతకాలంగా ఉంటున్నాడు. శనివారం రాత్రి 7 గంటలకు గోలు సింగ్ ఇంటికి వెళ్లిన పియూష్ తిరిగి రాలేదు. ఇవాళ గోలు సింగ్ ఇంట్లో పీయూష్ మృతదేహాన్నిపోలీసులు కనుక్కున్నారు. పీయూష్‌ని ఎమ్మెల్యే మేనల్లుడే హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహం స్వాధీనం చేసుకున్నప్పుడు ఇంట్లో ఎవరూ లేరని వారు వెల్లడించారు. కేసు దర్యాప్తు నిమిత్తం ఫోరెన్సిక్, డాగ్ స్క్వాడ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. గోలు సింగ్‌ హత్య చేసినట్లుగా అనుమానిస్తున్నామని.. ఈ కేసులో ఇప్పటివరకు ఎలాంటి అరెస్టులు జరగలేదని పోలీసులు చెప్పారు. నిందితుడు పరారీలో ఉన్నారని వివరించారు. పోస్ట్ మార్టం నివేదిక తరువాత మరిన్ని వివరాలు బయటకు వస్తాయన్నారు.


Next Story