
జిల్లా దేవనకొండలో దారుణంకర్నూలు జిల్లా దేవనకొండలో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో కుమారుడికి పురుగుల మందు తాగించి తాను తాగి కొడవలితో హల్చల్ చేశాడు. పత్తికొండకు చెందిన ఎరుకల బసవరాజు దేవకొండకు చెందిన అనితను 8 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొడుకు పుట్టాక భార్యపై అనుమానంతో ఆమెకు దూరంగా ఉంటున్నాడు. ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో భార్య అనిత దేవనకొండలోని తల్లిదండ్రుల ఇంట్లో ఉంటుంది.
అయితే ఇవాళ ఆమె ఇంటికి వెళ్లి హల్చల్ చేశాడు బసవరాజు. అనంతరం తన వెంట తెచ్చుకున్న పురుగుల మందును కుమారుడికి తాగించాడు. ఆ తర్వాత తాను తాగాడు. అనంతరం వేటకొడలితో వీధిలో వీరంగం సృష్టించాడు. తన భార్య తనను మోసం చేసిందంటూ అరుస్తూ అందరిని భయాందోళనకు గురి చేశాడు. అనంతరం కిందపడిపోయి చనిపోయాడు. అటు పురుగుల మందు తాగడంతో తీవ్ర అస్వస్థతకు గురైన బాలుడిని ఆసుపత్రికి తరలిస్తుండా మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com