
By - Chitralekha |28 July 2023 5:10 PM IST
కాకినాడ జిల్లా జగ్గంపేటలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. పలువురు అధికార పార్టీ నేతలు టీడీపీ తీర్థంపుచ్చుకున్నారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో మర్రిపాక గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు టీడీపీలో చేరారు. వారిని జ్యోతుల నెహ్రూ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వైసీపీని గెలిపించుకుని తప్పు చేశామని వారు తెలిపారు. చెప్పుతో కొట్టుకునే పరిస్థితి వచ్చిందన్నారు. ఏ ఇంటికి వెళ్లినా నాలుగేళ్లలో ఏం చేశారని ప్రజలు నిలదీస్తున్నారన్నారు. టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com