
By - Vijayanand |22 Aug 2023 6:46 PM IST
కృష్ణా జిల్లాలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్నారు టీడీపీ నేత వెనిగండ్ల రాము. అభిమానులతో కలిసి కేకును కట్ చేసిన వెనిగండ్ల రాము అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఇండియాకే మెగాస్టార్ చిరంజీవి అన్నారు.చిరంజీవి పవర్ఫుల్ వ్యక్తి అని ఈమధ్య కొంతమందికి జ్ఞానోదయం అయిందని, చిరంజీవిపై తప్పుడు వ్యాఖ్యలు చేసిన వారు ఈరోజు లెంపలు వేసుకుంటున్నారని అన్నారు. ఆయన సేవా కార్యక్రమాలు ఎందరికో ఆదర్శమని అన్నారు వెనిగండ్ల రాము.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com