
By - Chitralekha |9 Aug 2023 12:29 PM IST
కృష్ణా జిల్లా గుడివాడలో చిరంజీవి అభిమానుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. డౌన్ డౌన్ కొడాలి నాని... జై చిరంజీవ అంటూ నినాదాలు చేస్తూ.... పట్టణ పురవీధుల్లో అభిమానులు నిరసన ర్యాలీ నిర్వహించారు. కొడాలి నాని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చిరంజీవి అభిమానుల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు, చిరంజీవి అభిమానుల మధ్య జరిగిన తోపులాట వాగ్వాదానికి దారితీసింది. పలువురు అభిమానులను పోలీసులు అరెస్టు చేశారు. వంగవీటి మోహనరంగా విగ్రహానికి క్షిరాభిషేకం చేశారు. చిరంజీవికి కొడాలి నాని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com