
Chiranjeevi: సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను రంజింప చేస్తారు.. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ వారి హృదయాల్లో చోటు సంపాదించుకుంటారు మెగా స్టార్ చిరంజీవి. ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా అందరికంటే ముందుగా స్పందించేది, ఆదుకునేది చిరంజీవి మాత్రమే అంటే అతిశయోక్తి కాదు. తాజాగా బలగం మొగిలయ్య కిడ్నీ సంబంధిత వ్యాధులతో పాటు మరికొన్ని అనారోగ్య సమస్యలు ఆయన్ను వేధిస్తుండడంతో నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
కళ్లు కూడా సరిగా కనిపించని మొగిలయ్యకు కంటికి శస్త్ర చికిత్స చేయిస్తానని భరోసా ఇచ్చారు చిరంజీవి. ఈ విషయాన్ని బలగం దర్శకుడు వేణుకు తెలియజేయగా అతడు మొగిలయ్య దృష్టికి తీసుకువెళ్లాడు. ఓ యూట్యూబ్ ఛానెల్ మొగిలయ్య దంపతులను ఇంటర్వ్యూ చేయగా మెగాస్టార్ చేసిన సాయం వెలుగులోకి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం కూడా మొగిలయ్యకు ఉచిత వైద్యం అందిస్తామని భరోసా ఇచ్చింది.
Annayya #Chiranjeevi Personal call to @VenuYeldandi9 about Balagam Mogilaiah Eyes surgery@KChiruTweets said He will help financially for Mogailaiah Surgery#MegastarChiranjeevi pic.twitter.com/t2mwHTuyf1
— Chiranjeevi Army (@chiranjeeviarmy) April 17, 2023
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com