జాతీయ జెండా ఆవిష్కరించిన మంత్రి హరీష్‌రావు

జాతీయ జెండా ఆవిష్కరించిన మంత్రి హరీష్‌రావు

సిద్ధిపేటలోని మంత్రి క్యాంప్ ఆఫీస్ లో స్వాతంత్ర వేడుకలు వైభవంగా జరిగాయి. మంత్రి హరీష్‌ రావు... మువెన్నెల జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు హరీష్. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. అనంతరం ప్రసగించిన హరీష్..... సమైక్య రాష్ట్రంలో ఆనాటి పాలకులు ...తెలంగాణ వ్యవసాయాన్ని చిన్న చూపు చూశారన్నారు. రైతు బాధలను అవహేళను చేశారన్న ఆయన... వ్యవసాయం దండగ అంటూ చిత్రీకరించారన్నారు. ఆంధ్ర పాలకుల హయంలో తెలంగాణ పల్లెలు కన్నీళ్లు పెట్టాయన్న హరీష్... ఇప్పుడు కేసీఆర్‌ పాలనలో ఇవే పల్లెలు కళకళలాడుతున్నాయన్నారు.

Next Story