మాల్‌ను ప్రారంభించిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి

మాల్‌ను ప్రారంభించిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి

తెలుగు రాష్ట్రాలలో అతిపెద్ద వస్త్ర ప్రపంచంగా పేరుగాంచిన CMR షాపింగ్ మాల్.. తన 23వ నూతన షోరూంను సూర్యాపేటలో ప్రారంభించింది. మంత్రి జగదీష్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ అన్నపూర్ణ, స్థానిక కౌన్సిలర్లతో కలిసి షాపింగ్ మాల్‌ను ప్రారంభించారు. ప్రపంచస్ధాయి షాపింగ్ అనుభూతిని కలిగిస్తోందని మంత్రి జగదీశ్ అన్నారు. జిల్లా కేంద్రం వ్యాపార కూడలిగా రూపాంతరం చెందుతోందని అన్నారు. ప్రారంభోత్సవంలో సినీ నటి సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ సందడి చేశారు. ఆమెను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు.

Next Story