By - Vijayanand |24 Jun 2023 7:24 AM GMT
మంత్రి కేటీఆర్ ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. కేటీఆర్ ఢిల్లీ పర్యటనలో భాగంగా నేడు పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. నిన్న రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిసిన కేటీఆర్.. పలు అంశాలపై చర్చించారు. ఇవాళ కేంద్ర మంత్రి హర్దిప్ సింగ్తో కేటీఆర్ భేటీ కానున్నారు. హైదరాబాద్ మెట్రో విస్తరణపై కేంద్రమంత్రితో చర్చించనున్నారు. మరోవైపు కేంద్ర మంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ ఇంకా ఇవ్వలేదు. ఒక వేళ అమిత్ షా అపాయింట్ మెంట్ ఇస్తే ఆయనతో భేటీ అయి పలు అంశాలపై చర్చించనున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com