Uppal: శిల్పారామంలో చేనేత భవన్‌ కు శంకుస్థాపన చేసిన కేటీఆర్

Uppal: శిల్పారామంలో చేనేత భవన్‌ కు శంకుస్థాపన చేసిన కేటీఆర్

75 ఏళ్లు దాటిన చేనేతలకు ప్రభుత్వమే బీమా కల్పిస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. జాతీయ చేనేత దినోత్సం సందర్భంగా ఉప్పల్‌ శిల్పారామంలో చేనేత భవన్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కేటీఆర్ కొత్త మగ్గాలకు తెలంగాణ చేనేత మగ్గం అని అన్నారు. నేతన్నలకు 16 వేలకుపైగా కొత్త మగ్గాలు ఇవ్వబోతున్నట్లు తెలిపారు. నేటి నుంచే తెలంగాణ చేనేత మగ్గం పథకం అమలవుతుందన్నారు. ఇక చేనేత మీద ప్రధాని మోదీ 5 శాతం జీఎస్టీ వేశారని మండిపడ్డారు. ఇప్పటివరకు ఏ ప్రధాని ఇలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.

Next Story