
By - Chitralekha |19 Aug 2023 3:20 PM IST
వచ్చే ఎన్నికల తరువాత ప్రతిపక్షాలకు సినిమా చూపిస్తామన్నారు మంత్రి కేటీఆర్.హైదరాబాద్లో నిర్మించిన నాయిని నర్సింహారెడ్డి స్టీల్ బ్రిడ్జ్ని ప్రారంభించారు మంత్రి కేటీఆర్. 2.6 కిలో మీటర్ల పొడవు ఉన్న ఈ ప్లైఓవర్కు 450 కోట్ల రూపాయల వ్యయం అయింది.అతి ఎత్తైన స్టీల్ బ్రిడ్జితో దశాబ్దాల ప్రజల కల నెరవేరిందని అన్నారు మంత్రి కేటీఆర్.తెలంగాణ ఏర్పడ్డాక ప్రారంభించిన 36వ ఫ్లైఓవర్ ఇదని అని,స్టీల్ బ్రిడ్జ్తో హైదరాబాద్కు కొత్త అందం వచ్చిందని అన్నారు.లోయర్,అప్పర్ ట్యాంక్బండ్ కలిపేలా అద్భుత నిర్మాణం జరిగిందని,కేసీఆర్ నేతృత్వంలో హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు కేటీఆర్.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com