
By - Subba Reddy |17 April 2023 3:00 PM IST
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో మంత్రి కేటీఆర్ సుడిగాలి పర్యటన చేశారు. హైదరాబాద్ నుంచి బయల్దేరి వెళ్లిన మంత్రికి యాదవ కులస్తులు, స్థానికులు ఘనస్వాగతం పలికారు. ముందుగా దుమాల గ్రామంలో యాదవులు తలపెట్టిన బీరప్ప కళ్యాణ వేడుకల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మండలంలోని పలు అభివృద్ధి పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com