By - Chitralekha |11 Aug 2023 11:10 AM GMT
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్లు పంచుకోవడానికి సరిపోతుందని, ప్రజలకు ఉల్లిపొట్టు కూడా మిగలదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శించారు. మంత్రి క్యాంప్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అభివృద్ధి, సంక్షేమ రంగాలను రెండు కళ్ళుగా సీఎం కేసీఆర్ భావించి ముందుకు సాగుతున్నట్లు మంత్రి పువ్వాడ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ విజయం సాధిస్తే అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆగవని అన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com