Mulugu: ముంపు ప్రాంతాల్లో మంత్రి సత్యవతి రాథోడ్‌ పర్యటన

Mulugu: ముంపు ప్రాంతాల్లో మంత్రి సత్యవతి రాథోడ్‌ పర్యటన

ములుగు జిల్లాపై వరుణుడు ప్రతాపం చూపించాడు. భారీ వర్షాలకు ములుగు జిల్లా అతలాకుతలం అయ్యింది. మరోవైపు ముంపు ప్రాంతాల్లో మంత్రి సత్యవతి రాథోడ్‌ పర్యటించారు. రామన్నగూడెం పుష్కర ఘాట్‌ వద్ద గోదావరి ప్రవాహాన్ని పరిశీలించిన సత్యవతి రాథోడ్ ములుగు, భూపాలపల్లి జిల్లాలపై వర్షాలు పెను ప్రభావం చూపాయన్నారు. వరదల కారణంగా కొండాయి వద్ద 8మంది మృతి చెందడం బాధాకరమన్నారు. ఇక వదర ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు వేగంగా స్పందించారని..ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు జిల్లా వ్యాప్తంగా సుమారు 600మందిని కాపాడినట్లు తెలిపారు.

Next Story