
By - Sathwik |5 Jan 2024 7:30 AM IST
ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్యశాఖమంత్రి విడదల రజిని.. తప్పుడు చిరునామాతో ఓటుకు దరఖాస్తు చేశారంటూ తెలుగుదేశం నేతలు ఆరోపించారు. గత ఎన్నికల్లో చిలకలూరిపేటలో ఉన్న ఓటు హక్కును ఆమె ఇటీవల గుంటూరుకు మార్చుకున్నారు.ఈ క్రమంలో ఆమె తప్పుడు చిరునామా ఇచ్చారని ఆరోపించిన తెలుగుదేశం నాయకులు.... ఈ అంశంపై గుంటూరు వెస్ట్ ఓట్ల నమోదు అధికారికి ఫిర్యాదు చేశారు. శ్యామలా నగర్ లో ఉంటున్నట్టు.. మంత్రి ఇచ్చిన అడ్రస్ కు వెళ్లి చూస్తే అక్కడ ఖాళీ స్థలం ఉందని తెలుగుదేశం నేతలు ఫిర్యాదులో తెలిపారు. తప్పుడు చిరునామాతో దరఖాస్తు చేసిన మంత్రి ఓటు తొలగించాలని డిమాండ్ చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com