
By - Vijayanand |29 Aug 2023 4:18 PM IST
బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ప్రాణం పోయినా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు వెళ్లనని స్పష్టం చేశారు. తెలంగాణను హిందూ రాష్ట్రం చేయాలన్నదే తన లక్ష్యమన్న రాజాసింగ్… బీజేపీ టికెట్ ఇవ్వకుంటే రాజకీయలను పక్కనపెట్టి.. హిందూ రాష్ట్రం కోసం పని చేసుకుంటానని తెలిపారు. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటాను కానీ.. వేరే పార్టీల నుంచి కానీ పోటీ చేయనని రాజాసింగ్ స్పష్టం చేశారు. బీజేపీ అధిష్టానం తనపై సానుకూలంగా ఉందని సస్పెన్షన్ వేటు ఎత్తివేస్తారని ఆశాభావం వ్కక్తం చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com