By - Vijayanand |22 Aug 2023 12:16 PM GMT
బీఆర్ఎస్ పార్టీ నుంచి స్టేషన్ ఘన్పూర్ టికెట్ రాకపోవడంతో ఎమ్మెల్యే రాజయ్య బోరున వీలపించారు. సీఎం కేసీఆర్ లిస్ట్ ప్రకటించిన తరువాత తొలిసారి స్టేషన్ ఘన్పూర్లోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్కు వెళ్లిన రాజయ్యకు.. కార్యకర్తలు బాధాతప్త హృదయాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కార్యకర్తలను చూసిన రాజయ్య కన్నీళ్లు పెట్టుకున్నారు. తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేశానన్నారు. బీఆర్ఎస్ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారని చెప్పారు. ఇక దళిత బంధు 1100మందికి వచ్చేలా సిఫారసు చేసినట్లు తెలిపారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com