
By - Bhoopathi |25 Jun 2023 4:30 PM IST
రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రా రెడ్డికి ఘోర పరాభవం ఎదురైంది. గడపగడపకు కార్యక్రమంలో వైసీపీ సర్పంచ్ భారతి, ఎంపీటీసీ నారాయణ స్వామి పాల్గొనకుండా ఎమ్మెల్యే కాపు రామచంద్రా రెడ్డికి షాక్ ఇచ్చారు. అంతేకాదు.. హామీలు అమలు చేయకపోవడంతో ప్రజలు ఎమ్మెల్యేను నిలదీశారు. మరోవైపు కాపు రామచంద్రారెడ్డి రాకను నిరసిస్తూ గౌనూరు ప్రజలు ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోయారు. దీంతో ఏం చేయాలో అర్థంకాక కాపు రామచంద్రారెడ్డి అయోమయస్థితికి చేరుకున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com