
By - Vijayanand |15 July 2023 3:17 PM IST
తెలంగాణ ప్రజల భావోద్వేగాలు కాంగ్రెస్కు పట్టవన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి. తెలంగాణ రాష్ట్రం ఎవరో ఇచ్చిన భిక్ష కాదని, ప్రజల హక్కు అని అన్నారు. కాంగ్రెస్ హయాంలో వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. వ్యవసాయం, విద్యుత్ అంశాలు మలిదశ ఉద్యమంలో..కీలక పాత్ర పోషించాయన్నారు. ఉద్యమంలో కాంగ్రెస్ పాత్ర ఏంటో ప్రజలకు తెలుసంటూ సెటైర్లు వేశారు. దేశంలోనే తెలంగాణ విద్యుత్ మిగులు రాష్ట్రంగా ఉందని అన్నారు. విద్యుత్ కోత వల్ల ఒక పని ఆగిపోయిందన్న పరిస్థితి తెలంగాణలో లేదని చెప్పారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com