Pune: ఒకే వేదికను పంచుకున్న మోదీ, శరద్ పవార్

Pune: ఒకే వేదికను పంచుకున్న మోదీ, శరద్ పవార్

ప్రధాని మోదీ, నేషనలిస్ట్‌ కాంగ్రెస్ పార్టీ చీఫ్‌ శరద్ పవార్‌ ఒకే వేదికను పంచుకున్నారు. మహారాష్ట్రలోని పుణెలో మోదీకి 'లోకమాన్య తిలక్ జాతీయ అవార్డు' ప్రధానం సందర్భంగా ఈ సన్నివేశం చోటుచేసుకుంది. శరద్ పవార్ పార్టీ ఇటీవల రెండుగా చీలిన తర్వాత ఇద్దరూ కలుసుకోవడం ఇది మొదటిసారి. మోదీ కార్యక్రమంలో పవార్‌ పాల్గొనడం మంచి పరిణామం కాదని విపక్ష నేతలు పవార్‌కు సూచించినప్పటికీ ఆయన మోదీతో వేదికపంచుకోవడం ఆసక్తికరంగా మారింది. అయితే ఇరువురు నేతలు వేదికపై సుమారు గంట సేపు ఉన్నప్పటికీ మాట్లాడుకోలేదని తెలుస్తోంది.

Next Story