By - Chitralekha |29 May 2023 11:18 AM GMT
కర్నూలు జిల్లా పత్తికొండలో దారుణం చోటుచేసుకుంది. తండ్రి దహన సంస్కారాలకు కుమారులు రాలేదని మనస్తాపం చెందిన తల్లి, ఇంటి ఆవరణలోనే భర్తకు అంత్యక్రియలు నిర్వహించింది. అమెరికాలో స్ధిరపడిన ఇద్దరు కుమారులకు తండ్రి మరణం వార్త తెలియజేసినప్పటికీ, వారు రాలేమని చెప్పడంతో ఆమె ఇంతటి తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com