By - Vijayanand |12 Aug 2023 8:28 AM GMT
ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్ల గ్రామంలో కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయి. గ్రామంలో ఎటువైపు చూసిన కోతులే దర్శనమిస్తున్నాయి. వందల సంఖ్యలో ఒకేసారి ఇళ్లపై దాడి చేస్తుండటంతో భయాందోళనకు గురవుతున్నారు. ఇంట్లోని ఆహారం కోసం కోతులు ఎగబడుతున్నాయని గ్రామస్ధులు అంటున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కోతుల బెడద నుంచి తమను కాపాడాలని గ్రామస్ధులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com