తెలంగాణలో బీజేపీకి 70 సీట్లు ఖాయం: ఎంపీ అర్వింద్‌

తెలంగాణలో బీజేపీకి 70 సీట్లు ఖాయం: ఎంపీ అర్వింద్‌

తెలంగాణలో బీజేపీకి 70 సీట్లు ఖాయమని ఎంపీ అర్వింద్‌ చెప్పారు. సీట్లు తగ్గినా ఏర్పడేది తమ ప్రభుత్వమేనన్నారు. ధాన్యం కొనుగోళ్లలో చేసిన అవినీతి, అక్రమాలతో బీఆర్‌ఎస్‌ మళ్లీ గెలవాలని చూస్తోందని అర్వింద్‌ ఆరోపించారు. ధాన్యం సేకరణలో వెయ్యి కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థికి బీఆర్‌ఎస్‌ పార్టీ 40 కోట్లు ఇస్తోందని అన్నారు. ఏమైనా రాష్ట్రంలో ప్రజలు బీఆర్‌ఎస్‌కు ఓటు వేసే పరిస్థితి లేదన్నారు. నిజామాబాద్‌ జిల్లాలో పర్యటించిన ఎంపీ అర్వింద్‌...భీంగల్‌ మండలం లింగాపూర్‌లో శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

Next Story