
ముంబయి-అహ్మదాబాద్ మధ్య ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న బుల్లెట్ట్రైన్ ప్రాజెక్ట్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటివరకు వంద కి.మీ.వయాడక్ట్, 230 కిలోమీటర్ల పీర్ వర్క్ పనులు పూర్తి చేసినట్లు జాతీయ హైస్పీడ్ రైల్ కార్పోరేషన్-N.H.S.R.C.L. ప్రకటించింది. 40మీటర్ల పొడవైన ఫుల్స్పాన్ బాక్స్ గిర్డర్లు, సెగ్మెంటల్ గిర్డర్ల ద్వారా 100 కి.మీ. వయాడక్ట్ల నిర్మాణం పూర్తి చేసినట్లు NHSRCL వెల్లడించింది. రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్....ఈ పనులకు సంబంధించిన సమాచారాన్ని ఎక్స్లో షేర్ చేస్తూ ఓ వీడియాను కూడా ట్యాగ్ చేశారు. గుజరాత్లోని వల్సాద్, నవసారి జిల్లాల్లోని పార్, ఔరంగ, పూర్ణ, మింధోలా, అంబికా, వెంగానియా 6నదులపై వయాడక్ట్లు పనులు చేపట్టినట్లు NHSRCL ప్రకటించింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన తొలి గిర్డర్ను నవంబర్ 25, 2021 ప్రారంభించిన NHSRCL....వయాడక్ట్ తొలి కి.మీ.ను 6నెలల్లో జూన్ 30 2022న పూర్తి చేసినట్లు పేర్కొంది. 50కి.మీ. వయాడక్ట్ల నిర్మాణం ఈ ఏడాది ఏప్రిల్ 22న పూర్తి కాగా....ఆ తర్వాత 6నెలల్లో వంద కి.మీ. మైలురాయిని చేరినట్లు NHSRCL వెల్లడించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com