By - Dayakar |17 Jun 2023 4:30 AM GMT
ఏలూరు లోని పాత బస్టాండ్,34వ డివిజన్ వద్దగల DM&HO ఆఫీస్ వెనుక సుమారు 50 సంవత్సరాల నుండి పేదలు నివాసం ఉంటున్న ఇళ్లను ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా మున్సిపల్ అధికారులు కూల్చివేశారు.. ఈరోజు ఉదయం నుండి తొలగిస్తు, తొలగింపు సమాచారాన్ని బయటకు తెలియకుండా JCB లతో ఇళ్లను కులుస్తూ స్థానిక ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు..సమాచారం తెలుసుకున్న ఏలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బడేటి రాధాకృష్ణయ్య (చంటి) బాధిత ప్రాంతానికి వెళ్లడంతో మున్సిపల్ అధికారులు పలాయనం చిత్తగించారు,బాధితులకు న్యాయం జరిగే వరకూ అండగా ఉంటానని, ఆయన తెలిపారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com