By - Chitralekha |29 July 2023 7:15 AM GMT
ఖమ్మం జిల్లా రూరల్ మండలం మున్నేరు వరద ముంపుకు గురైన కాలనీల్లో పరిస్థితి దయనీయంగా తయారైంది. జలగం నగర్, ఆర్టీసీ కాలనీ, కేబీఆర్ నగర్ కాలనీల్లోని ఇళ్లలోకి వరద నీరు భారీగా వచ్చి చేరడంతో అధికారులు ఆ ప్రాంత వాసులకు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద తగ్గుముఖం పట్టిన తర్వాత ఇళ్లకు చేరుకున్న వారు పరిస్ధితిని చూసి కంటతడి పెట్టారు. ఇళ్లలోని ఫర్నీచర్, ఇతర సామాగ్రి తడిచిపోయి నిరుపయోగంగా మారాయి. వరదకు కాలనీల్లోని రోడ్లు కూడా ధ్వంసమయ్యారు. వరదలతో నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com