
By - Vijayanand |7 Aug 2023 2:40 PM IST
అన్నమయ్య జిల్లా మదనపల్లిలో దారుణ ఘటన జరిగింది. అల్తాఫ్ అనే వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. అల్తాఫ్పై పెట్రోల్ పోసి నిప్పంటించారు గుర్తు తెలియని దుండగులు. ఓ వాహనంలో వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో అల్తాఫ్కు తీవ్ర గాయాలు అయ్యాయి. బాధితుడిని చికిత్స నిమిత్తం మదనపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com