
By - Bhoopathi |26 Jun 2023 5:00 PM IST
గుంటూరు జిల్లాలోని సీతానగరం కృష్ణా నది ఎగువ భాగంలో నాగ ప్రతిమలు బయటపడ్డాయి. విగ్రహాలు ఏ కాలానికి చెందినవో తెలుసుకునేందుకు పురావస్తు శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. అయితే శిల్పులు డ్యామేజ్ అయిన విగ్రహాలను ఇక్కడ వదిలి వెళ్లారా.. లేదా కూల్చేసిన ఆలయాల్లోని విగ్రహాలు నదిలో వదిలిపెట్టారా అంటూ స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇలాంటి విగ్రహాలు ఎక్కడ ఉంటే అక్కడ దోషాలు చుట్టుముడుతాయంటున్న భక్తులు, అందుకే నాగ ప్రతిమలను నదిలలో వదిలి వెళ్లారంటూ చెబుతున్నారు. కృష్ణానదిలో మరిన్ని విగ్రహాలు బయటపడే అవకాశం ఉందని చెబుతున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com