
By - Chitralekha |27 July 2023 5:37 PM IST
హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ శివాలయంలో వింత చోటుచేసుకుంది. శివాలయంలో నందీశ్వరుడు నీళ్ళు తాగుతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ వింతను చూసేందుకు జనాలు ఆలయానికి క్యూ కట్టారు. తండోపతండాలుగా ఆలయానికి చేరుకుంటున్నారు. అత్తాపూర్ లోని చిన్న అనంతగిరిగా పిలుచుకునే శివాలయంలో నందీశ్వరుడు నీళ్ళు తాగడాన్ని గమనించిన కొందరు భక్తులు వింతను చూసి ఆశ్చర్యపోయారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా తెలియడంతో నందీశ్వరుడు నీళ్ళు తాగడం చూసేందుకు చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు అలయం వద్దకు క్యూ కట్టారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com