Yuvagalam: ప్రజల కోసం లోకేష్ పోరాడుతున్నాడు- భువనేశ్వరి

Yuvagalam: ప్రజల కోసం లోకేష్ పోరాడుతున్నాడు- భువనేశ్వరి


రేపటితో పాదయాత్రకు 200 రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో... భగవంతుడు లోకేష్ కు అన్ని శక్తులు ఇవ్వాలని కోరుకున్నారు నారా భువనేశ్వరి. లోకేష్‌ ప్రజల కోసం పోరాడుతున్నారన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కాశిపెంట్లలో నూతన హెరిటేజ్ పార్లర్‌ను భువనేశ్వరి ప్రారంభించారు. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను తెలియజేయడానికి ప్రజల తరపున లోకేష్ పాదయాత్ర చేపట్టారన్నారు. రేపు తమ కుటుంబం సభ్యులు లోకేష్ పాదయాత్రలో పాల్గొంటారని.. అందరూ పాదయాత్రను దిగ్విజయం చేయాలన్నారు నారా భువనేశ్వరి.

Next Story