
By - Sathwik |6 Jan 2024 7:30 AM IST
విశాఖలో నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి' యాత్ర నిర్వహించారు. చంద్రబాబు అరెస్టుతో మనస్తాపానికి గురై చనిపోయిన 33వ డివిజన్ వెంకటేశ్వరమెట్ట కు చెందిన తెలుగుదేశం కార్యకర్త జాగరపు చిన్నా, 41వ డివిజన్ జ్ఞానాపురంలో మృతి చెందిన మలిశెట్టి రమణ కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించారు. 45వ డివిజన్ తాడిచెట్లపాలెం కనకరాజు కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. గాజువాక 66వ డివిజన్ అజిమాబాద్ కోరుకొండ మంగ, 65వ డివిజన్ భానోజి తోటలో సరోజిని, షీలానగర్లో కృష్ణమూర్తి కుటుంబాలను ఆమె ఓదార్చారు. ఆరు కుటుంబాలకు పార్టీ తరఫున ఆమె ఆర్థికసాయం అందించారు. భువనేశ్వరితో పాటు తెలుగుదేశం ప్రముఖ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.TDP: కొనసాగుతున్న నిజం గెలవాలి యాత్ర
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com