
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తనతో లేకుండా తొలిసారి తిరుమల వెళ్లానని ఆయన సతీమణి నారా భువనేశ్వరి తీవ్ర భావోద్వేగాని గురయ్యారు. ఈ ప్రయాణం ఎంతో భారంగా ఉందని నారా భువనేశ్వరి భావోద్వేగ ట్వీట్ చేశారు. దేవుడి దయతో నిజం గెలుస్తుందని నమ్ముతున్నాని.. తన భర్త లేకుండా తొలిసారి తిరుమలకు వెళ్లానని ఆమె అన్నారు. ఎప్పుడూ కుటుంబ సభ్యులతో కలిసి ఊరు వచ్చే ఆయన జైల్లో ఉన్న కారణంగా ఈరోజు ఒంటరిగా నారావారిపల్లెకు వెళ్లానని... ఈ ప్రయాణం తనకు ఎంతో బాధ కలిగించిందని భువనేశ్వరి అన్నారు. ప్రతి నిమిషం భారంగా గడిచిందని, ఆ ఏడుకొండల వాడి దయతో, మా ఊరు నాగాలమ్మ తల్లి కృపతో, ప్రజల మద్దతుతో నిజం గెలుస్తుందని నమ్ముతున్నాని, దానిలో భాగంగా నేడు చంద్రగిరిలో తొలి అడుగు వేస్తున్నానని భువనేశ్వరి ట్వీట్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com